సికింద్రాబాద్, మార్చి 5: వార్తల సేకరణ కోసం నిత్యం బిజీగా ఉండే పాత్రికేయులు క్రీడల్లోను రాణిం చడం అభినందనీయమని మంత్రి మల్లారెడ్డి ప్రశంసించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జన్మదినాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని కృష్ణ స్వామి స్టేడియంలో కంటోన్మెంట్ ప్రింట్, ఎలక్ట్రానిక్ జట్ల మధ్య 20-20 మ్యాచ్ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిలతో సహా మంత్రి మల్లారెడ్డి హాజరై కాసేపు సరదాగా క్రికెట్ ఆడి మ్యాచ్ను ప్రారంభించారు.
టాస్ గెలిచిన ఎలక్ట్రానిక్ మీడియా జట్టు ప్రింట్ మీడియా జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ప్రింట్ మీడియా జట్టు విజయం సాధించగా, టీఎన్ శ్రీనివాస్ ఇరుజట్లకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నేతలు దేవులపల్లి శ్రీనివాస్, నాగినేని సరిత, కుమార్, టింకూగౌడ్లతో పాటు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, మార్చి 5: ఎమ్మెల్యే సాయన్న జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు కంటోన్మెంట్ వ్యాప్తంగా శనివారం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే సాయన్న కుటుంబసభ్యులతో కలిసి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ఎమ్మెల్యే సాయన్న చేత కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే సాయన్న చేతుల మీదుగా దివ్యాంగులకు వీల్చైర్లను అందజేశారు. అదే విధంగా గణేశ్ టెంపుల్ మాజీ చైర్మన్ పిట్ల నాగేష్ముదిరాజ్ నేతృత్వంలో భారీగా తరలివచ్చిన నేతలు గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. మూడో వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజ్సింగ్ ఎమ్మెల్యే సాయన్న జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లాస్యనందితా, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నళినికిరణ్, లోక్నాథ్, పాండుయాదవ్తో పాటు నేతలు నివేదితా, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి శర్విన్, జైప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.