బేగంపేట్ మార్చి 5: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. శనివారం రాంగోపాల్పేట్ డివిజన్లోని విక్టోరియాగంజ్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఇలాంటి శిక్షణ కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. మగ్గం వర్క్పై ఆసక్తి ఉన్న వారికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో అమ్మవారి ఆలయం నిర్మించాలని కోరగా త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అవసరమైన సామగ్రిని సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, కిరణ్మయి, నిర్వాహకులు శ్రీనివాస్రెడ్డి, శివరాణి, బస్తీ కమిటీ సభ్యులు అర్జున్కుమార్, మల్లేశ్, లావణ్య, శివకుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.