మల్లాపూర్, మార్చి 5 : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దంపతులు శనివారం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా శివరాత్రికి నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వేద పండితులు రామ్మోహన్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉమాపతి శర్మ, బోర్డు సభ్యులు రమేశ్యాదవ్, శ్రావణ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.