సిటీబ్యూరో/మేడ్చల్, మార్చి 4(నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఈ వేడుకను పురసరించుకొని ఈ నెల 8న ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవనంలో హైదరాబాద్ జిల్లా స్థాయిలో మహిళా సదస్సును నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి తలసాని వివరాలను వెల్లడించారు. ఈ నెల 6, 7, 8వ తేదీలలో మూడు రోజుల పాటు మహిళా దినోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మహిళా బంధు వేడుకలలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొనాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
‘మహిళలే మహారాణులు’: ఎమ్మెల్యే మాగంటి
టీఆర్ఎస్ పాలనలో ‘మహిళలే మహారాణులు’ అని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈ నెల 6,7,8 తేదీలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై శుక్రవారం కార్పొరేటర్లు, డివిజన్ ధ్యక్షులకు మాగంటి గోపీనాథ్ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య విజయ, సీఎన్ రెడ్డి, సంగీత యాదవ్, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, సంజీవ, ప్రదీప్, సంతోష్ ముదిరాజ్, మన్సూర్ పాల్గొన్నారు.
సంబురాలకు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు సిద్ధం
కేసీఆర్ మహిళా బంధు సంబురాల ఏర్పాట్లలో టీఆర్ఎస్ శ్రేణులు నిమగ్నమయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మహిళ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. కేసీఆర్ మహిళా బంధు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలను తయారు చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సంబురాలలో వేలాది సంఖ్యలో మహిళలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళా బంధును విజయవంతం చేస్తాం
కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. మూడు రోజులు పాటు మహిళ దినోత్సవం సందర్భంగా అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహిస్తాం. జిల్లాలోని మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో కనివిని ఎరగని రితిలో కేసీఆర్ మహిళా బంధును నిర్వహిస్తాం.
– మంత్రి మల్లారెడ్డి
6వ తేది
చిత్రపటానికి ఆదివారం రాఖీలు కట్టడం, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశా వరర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళా నాయకులను గౌరవ పూర్వకంగా సన్మాన కార్యక్రమాలు.
7వ తేది
ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఇండ్లకు పార్టీ శ్రేణులు నేరుగా వెళ్ళి కలవడం, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకుంటారు.
8వ తేది
జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు, సంబురాలు నిర్వహించడంతో పాటు, మహిళల
అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై వాడవాడలా విసృ్తత ప్రచారం నిర్వహిస్తారు.