సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తేతెలంగాణ) : మార్చి ఆరంభం నుంచే ఎండలు దంచుతున్నాయి. శివరాత్రి ఇలా వెళ్లిందో లేదో.. అప్పుడే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఫలితంగా గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పగలు, రాత్రి వ్యత్యాసం లేకుండా గృహ విద్యుత్ వినియోగంతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో కరెంటు వినియోగం పెరిగింది. ఫిబ్రవరి మాసంలో 42 నుంచి 43 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం ఉండగా, మార్చి 2 నాటికి 51 మిలియన్ యూనిట్లుకు చేరిందని అధికారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో జనవరిలో రోజువారి విద్యుత్ వినియోగం తక్కువగా ఉండగా, ఫిబ్రవరి నుంచి స్వల్పంగా పెరిగింది. ఇక మార్చి మొదటివారం నుంచే వేసవికాలం ప్రారంభమవుతుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతూనే ఉంటుందని, దానికనుగుణంగా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.
గత మార్చిలో అత్యధికంగా..
గతేడాది మార్చిలో అత్యధికంగా 57 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, ఈ ఏడాది దాన్ని మించే అవకాశం ఉంది. ఏడాది కాలంలో కొత్తగా 6 లక్షల విద్యుత్ కనెక్షన్లు వచ్చాయి. ప్రధానంగా ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో మొత్తం పీక్అవర్ డిమాండ్ సుమారు 7500 మెగావాట్ల వరకు ఉండగా, అందులో గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలో 3500 మెగావాట్ల నుంచి 3700 మెగావాట్ల వరకు ఉంటుందని తెలిపారు.
ఇక కేసీఆర్నగర్
రూ.36.27 కోట్ల వ్యయంతో 5.18 ఎకరాల విస్తీర్ణంలో జీ+3 పద్ధతిన 22 బ్లాకుల్లో ఇండ్లు నిర్మించారు. ప్రతి ఇంటికి గాలి, వెలుతురు ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాలు, వంటగది, రెండుపడక గదులు, బాల్కనీ, భారతీయ శైలిలో ఒకటి, పాశ్చాత్య శైలిలో మరొక బాత్రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాకును అనుసంధానించేలా విశాలంగా సీసీ రోడ్లు నిర్మించారు. వాననీరు వృథా కాకుండా ప్రతి బ్లాకు వద్ద ఇంకుడుగుంత నిర్మించారు. ఈ హౌసింగ్ కాలనీకి కేసీఆర్నగర్ నామకరణం చేశారు.
మేలో గరిష్టస్థాయికి డిమాండ్
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 2020,2021 వేసవిలో విద్యుత్ డిమాండు తక్కువగా నమోదైంది. 2019లో 73.4 మిలియన్ యూనిట్లు ఉండగా, 2020 మే మాసంలో 69 మిలియన్ యూనిట్లు, 2021 వేసవిలో రోజువారి విద్యుత్ డిమాండు 70 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా, 2022లో మేలో 80 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా మూడోదశ ముగియడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నిరకాల వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలు పూరిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.