సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ ) : రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాగునీరు, సీవరేజీ, తదితర అంశాలపై ఓఆండ్ఎం అధికారులతో గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలకు అవసరమైతే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. లోప్రెషర్, టెయిల్ ఎండ్ ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పవర్ బోర్వెల్స్ పనితీరును పరిశీలించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పేరొన్నారు. అలాగే సీవరేజీ నిర్వహణలో సమస్యలు రాకుండా చూడాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిషరించాలని చెప్పారు. రిజర్వాయర్ల భద్రతకు సెక్యూరిటీ సిబ్బందిని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేరొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.
జలమండలికి అవార్డు
జలమండలికి తెలంగాణ వాటర్ కన్జర్వేషన్ అవార్డు – 2021 దకింది. ఉత్తమ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కేటగిరీలో తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ అవార్డును జలమండలికి అందించింది. నీటి సంరక్షణపై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పారు నిర్మించడం, ఎన్జీవోల భాగస్వామ్యంతో వాక్, జలం – జీవంలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్లో జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్ రావు నుంచి జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు అవార్డు అందుకున్నారు. అనంతరం జలమండలి కార్యాలయంలో ఎండీ దానకిశోర్కు అవార్డు అందించడంతో ఆయన అధికారులను అభినందించారు.