ఉప్పల్జోన్ బృందం, మార్చి 1 : శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి.. భక్తుల అభిషేకాలు, అర్చనలు, పూజలతో శివక్షేత్రాలు భక్తపారవశ్యంతో నిండిపోయాయి.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాల్లో భక్తుల పూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో భక్తులు శివుడిని దర్శించుకొని పూజలు చేశారు. ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.