మల్లాపూర్, నవంబర్ 14 : తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నదని కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ మార్వాడీ సంఘం నూతన అధ్యక్షుడు కైలాష్, కార్యవర్గ సభ్యులను మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి తో కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మార్వాడీలు ఎలాంటి సమస్యలున్నా తనకు తెలియజేయాలని.. వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఉపా ధ్యక్షుడు దగ్లారాం, కార్యదర్శులు దుర్గారాం, అనిల్జౌన్, కోశాధికారి, ప్రేమ్ సిర్వి పాల్గొన్నారు.