సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మల్లారెడ్డి యూనివర్సిటీలోని న్యూబిల్డింగ్లో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల కోసం అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. దేశంలో అగ్రికల్చరల్ సైన్సెస్ ప్రాధాన్యతను పలువురు నిపుణులు వివరించారు. యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న వ్యవసాయ కోర్సులు, వాటికున్న డిమాండ్పై సూచనలు చేశారు. అనంతరం మొదటి సంవత్సరంలో మెరిట్ సాధించిన ముగ్గురి విద్యార్థులకు రూ. 5 వేల నగదుతో పాటు సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ సెక్రటరీ మహేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శాలినిరెడ్డి, అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ.రాజారెడ్డి, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వీఎస్కే రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. శ్రీరామరెడ్డి, సహస్ర గ్రూప్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్ర మోహన్ పాల్గొన్నారు.