కీసర, నవంబర్ 14: అయ్పప్పస్వామి ఆలయ నిర్మాణం కోసం భారీగా విరాళాలు రావడం సంతోషంగా ఉందని కీసర అయ్యప్ప సేవా సమితి గురుస్వామి నల్ల బాల్రెడ్డి తెలిపారు. కీసరలో నిర్మిస్తున్న అయ్యప్ప గుడిలో 18 మెట్ల కోసం మాజీ ఎంపీటీసీ మచ్చాని జంగయ్యయాదవ్ రూ.1.20 లక్షలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప గుడి నిర్మాణానికి దాతల సహకారం మరువలేదన్నారు. వచ్చే నెలలో అయ్యప్ప ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో గురుస్వామి మహేందర్, బి.శంకర్గౌడ్, విష్ణు, బి.రమేశ్యాదవ్, శీలం శ్రీనివాస్, ఎం.రవీందర్, చిన్న, నరహరి, కేబుల్ శ్రీనివాస్, ఎం.ఐలేశ్, బాలేశ్ పాల్గొన్నారు.