సికింద్రాబాద్, నవంబర్ 11: ఈ-శ్రమ్ పోర్టర్ను కార్మికులందరూ సద్వినియోగం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహమ్మద్ వికార్ బాబా సూచించారు. ఈ మేరకు గురువారం బోయిన్పల్లి మార్కెట్లో హమాలీ కార్మికులకు ఈ-శ్రమ్కు సంబంధించిన అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా స్కీమ్లో చేరిన కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీంలో తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ -శ్రమ్లో అసంఘటిత కార్మికులందరూ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహ, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ సలావుద్దీన్, హమాలీ యూనియన్ నాయకులు ఎల్లయ్య, ఐలయ్య, కొమరయ్య, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.