సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సమృద్ధిగా నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2 పనులను పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల ప్రారంభించారు. ఇందులో భాగంగానే బుధవారం ఇబ్రహీంపట్నంలో చేపట్టనున్న రూ.221కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారు. హయత్నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో సుమారు రూ. 134 కోట్లతో ఇన్లెట్, ఔట్లెట్, పైపులైన్ వ్యవస్థ, సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం, తదితర పనులు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొంటున్నారు.