చిక్కడపల్లి, నవంబర్11 : సినిమా పాటల రచయిత కందికొండ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఆయనను ఆంధ్ర హీరోలు ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ అన్నారు. గురువారం జేఏసీ చిక్కడపల్లిలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా కందికొండ క్యాన్సర్తో బాధపడుతూ సం పాధించిన డబ్బు అంతా ఖర్చు చేసుకుని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాసిన పాటల ద్వారా కోట్లాది రూపాయిలు సంపాధించిన హీరోలు మహేశ్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ ఇతర ప్రముఖులు ఇంత వరకు ఆయనను పరామర్శించక పోవడం దారుణమన్నారు. జేఏసీ గౌరవాధ్యక్షుడు సుంకర సత్యనారాయణ, జేఏసీ కో-ఆర్డినేటర్ మురళీధర్ దేశ్పాండే, నల్ల రాధాకృష్ణ, మోహన్రాజ్, ప్రేమ్, బాలసుబ్రహ్మణ్యం, శైలజ తదితరులు పాల్గొన్నారు.