మార్చి 28న యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారి దర్శనానికి కంటే ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను పరిశీలించారు. అనంతరం కాలినడకన యాదాద్రి ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
ప్రధానాలయం, గర్భగుడి, కల్యాణకట్ట, పుష్కరిణీతో పాటు 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సుదర్శన యాగం ఏర్పాట్లను పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగిన సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
– నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఫిబ్రవరి 7, యాదాద్రిభువనగరి