సుల్తాన్బజార్, నవంబర్ 11 : దేశానికి మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రిగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం విద్యా వ్యవస్థ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం నాంపల్లిలోని రూసా భవనంలో జాతీయ విద్యా దినం, 133వ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ఉన్నతవిద్య గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నైపుణ్యవంతమైన విద్య అనే అంశంపై ఒక్కరోజు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అన్నారని గుర్తు చేశారు. ఇంటర్ విద్యా సంచాలకులు సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భారత రత్న అబ్దుల్ కలాం పాల్గొన్న విధానం త్యాగ నిరతికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం హాజరైన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను అందించి ప్రత్యే కంగా అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ఎంసీక్యూ హెచ్ఆర్డీ డాక్టర్ అమీరుల్లాఖాన్, తెలంగాణ ఇంటర్ విద్యా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం లక్ష్మణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఓబిలి రాణి తదితరులు పాల్గొన్నారు.