ముంబై, జనవరి 20: కరోనా చికిత్సకు వినియోగించే మోల్న్పిరవిర్ క్యాప్సుల్స్ తయారీ, మార్కెటింగ్కు సంబంధించి రెండు హైదరాబాదీ కంపెనీలు లైసెన్సింగ్ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ప్రకారం స్విట్జర్లాండ్కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ) నుంచి ఈ డ్రగ్ తయారీ, మార్కెటింగ్కు అనుమతి లభించినట్లు నాట్కో ఫార్మా, బయోఫోర్ ఇండియాలు గురువారం ప్రకటించాయి. అమెరికాకు చెందిన మెరక్ షార్ప్ అండ్ డొహ్మే కార్పొరేషన్ (ఎంఎస్డీ)ఈ ఔషధాన్ని అభివృద్ధిపర్చగా, ఎంఎస్డీ నుంచి ఎంపీపీ అంతర్జాతీయ లైసెన్స్ను పొందింది.