సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): ‘జ్ఞానం చిగురు తొడిగితే పుస్తకం అని, ఒక మంచి పుస్త కం నూరు మంది స్నేహితులతో సమానం’ అన్న నానుడి హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో సాక్షాత్కరిస్తుంది. గత వారం రోజులుగా తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడి యం) పుస్తక ప్రియులతో కళకళలాడుతున్నది. బాల్యం నుంచే పఠనాసక్తిని పెంపొందిస్తేనే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పలువురు కవులు, రచయితలు పేర్కొన్నా రు. విద్యార్థులు, కవులు, రచయితలతో బుక్ ఫెయిర్ స్టా ల్స్ కిటకిటలాడుతున్నాయి. పలువురు రాసిన పుస్తకాల ను చిందు ఎల్లమ్మ వేదికపై ప్రముఖులు ఆవిష్కరించి, విశ్లేషణ చేశారు. ప్రదర్శన అధ్యక్షుడు జూలూరు గౌరీ శం కర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రదర్శనలోకి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అడుగుపెట్టగానే సీఎం కేసీఆర్పై జూలూరు గౌరీ శంకర్ రచనలకు వేదికగా ఉన్న తెలంగాణ విజయగాథ స్టాల్ను సందర్శించారు.
‘శాతవాహనుల నుంచి కాకతీయుల వరకు, తెలంగా ణ పద్య కవితా వైభవం, మూడు తరాల తెలంగాణ కథ, తెలంగాణ సామెతలు, తెలంగాణ నవలా వికాసం, తెలంగాణ సినీగేయ వైభవం, మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం, తెలంగాణలో శాతవాహనుల వారసత్వం, తెలంగాణలో భావ కవితా వికాసం, గోండ్వానా లాండు ఎంత ప్రాచీణమైన దో-తెలుగు కూడా అంతే ప్రాచీనమైనది, మందార మకరందాలు, రైతు రుణ విముక్తి, ప్రతాపరుద్ర చరిత్రము, పలు జిల్లాల సాహిత్య చరిత్రలు’ లభ్యమవుతున్నాయి.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ స్టాల్ నిలుస్తున్నది. ‘ఆకుపచ్చని పొద్దు పొడుపు, తెలంగాణ వాగ్గేయ వైభవం, గొల్ల రామ వ్వ-ఇంకొన్ని కథలు, పద్య తెలంగాణ, స్వేద భూమి, తల్లివేరు, కళా తెలంగాణం, ఏ గ్రీన్ గార్లాండ్, పటం కథ లు, నయాసాల్, తెలంగాణ తేజోమూర్తులు’ లాంటి పుస్తకాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన వైవిద్యతకు అద్దం పడుతున్నాయి.
పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ రచనలకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ విజయగాథ స్టాల్ నిలుస్తున్నది. సాహితీ ప్రియులతో పాటు తెలంగాణ ఉద్యమకారులను అమితంగా ఆకర్శిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించిన అనేక పుస్తకాలు ఆయన రచించారు. జూలూరు కలం నుంచి జాలువారిన రచనలను ఆసక్తిగా తిలకిస్తూ కొనుగోలు చేస్తున్నారు. స్టాల్లో ‘తెలంగాణ విజయ గాథ, ఆత్మ బంధువు -దళిత సంక్షేమం, సమ్మోహనం – కేసీఆర్ ప్రసంగాలు, ఒక్కగానొక్కడు, కాళేశ్వరం విశేషాలను వర్ణిస్తూ రచించిన జీవధార, ఎందరొచ్చినా ఈ మట్టి ఆత్మ కేసీఆర్కు తెలుసు’ లాంటి పుస్తకాలు ఉన్నాయి. వనం జ్వాలా నర్సింహారావు రాసిన ‘రేపటి చూపు, అతడు యోధుడు, స్వప్న సాకారం, జ్వలిత దీక్ష – తెలంగాణను కుదిపేసిన 11 రోజులు’ లాంటి పుస్తకాలు కొలువుదీరాయి.
పుస్తక పఠనంతో బ్రెయిన్కు ఎక్సెర్సైజ్ అవుతుంది. ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్న తీరులోనే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా అధ్యయనాన్ని కొనసాగించాలి. జీవితంలో పుస్తకం ఒక భాగం కావాలి. – బండారు దత్తాత్రేయ, హర్యానా గవర్నర్
ఆవిష్కరణలకు వేదికగా చిందు ఎల్లమ్మ పలు పుస్తకాల ఆవిష్కరణ
సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): పుస్తక ప్రదర్శనలో పలు పుస్తకాల ఆవిష్కరణకు చిందు ఎల్లమ్మ మంటపం వేదికైంది. శుక్రవారం విపంచి ఫౌం డేషన్ లోగోతో పాటు కరపత్రాన్ని గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్, కవి సంగిశెట్టితో కలిసి ఆవిష్కరించారు.
సిద్ధంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్ రచించిన ‘తొండెం బొక్కెన దళిత కథ వార్షిక 2020’ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ హాజరై శుక్రవారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. సా హిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, సి.కాశీం, సంగిశెట్టి శ్రీనివాస్, మెర్సి మార్గరేట్, డాక్టర్ వై.బి.సత్యనారాయణ, అందె భాస్కర్ పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిశోధకుడు రియాజ్, డాక్టర్ వీఎన్వీకే శాస్త్రి రాసిన ‘నేను సైతం’ పుస్తక ఆవిష్కరణ బండారు రవి కుమార్ అధ్యక్షతన జరిగింది. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ జి.విజయరా వు, బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, రచయిత, కవి తంగిరాల చక్రవర్తి పాల్గొన్నారు. సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన దళిత కథలు గ్రంథాన్ని చిందు ఎల్లమ్మ వేదికపై ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఆవిష్కరించారు. జీలం చట్టరాజ్ రచించిన ‘నాయిస్ క్యాన్సిలేషన్’ అనే ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పగిడిపాల రచించిన ‘రెప్ప వాల్చని కాలం’, ‘తెలుగెత్తి జై కొట్టు’లను ఆవిష్కరించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. అంత కు ముందు తెలంగాణ విజయ గాథ, ఆకు పచ్చని అక్షరం, బీసీ స్టడీ సర్కిల్, రైటర్స్ స్టాల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్ డివిజన్ స్టాల్ను సందర్శించారు. అనంతరం 14 ఏండ్ల యువ రచయిత్రి వైష్ణవిని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలని సూచించారు. వైదికపై 92 ఏండ్ల కవి, రచయిత శ్రీరామ కవచం వేంకటేశ్వర్లను గవర్నర్ అభినందించారు.