కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4,014 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,435 ఓట్లు, కాంగ్రెస్కు 132 ఓట్లు పోలయ్యాయి. ఐదో రౌండ్లో బీజేపీకి 344 లీడ్ రాగా, ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 20,158 ఓట్లు రాగా, బీజేపీకి 22,327, కాంగ్రెస్కు 811 ఓట్లు వచ్చాయి.