హుజురాబాద్ : దళితబంధు సర్వేలో భాగంగా బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హుజురాబాద్ పట్టణంలోని దమ్మక్క పేటలో పర్యటించారు. శోభమ్మ- బొందయ్య ఇంటికి వెళ్లి వారితో కూర్చుండి దళిత బంధు పథకం పై వారికి అవగాహన కల్పించారు..ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు… దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ దళిత బంద్ కార్యక్రమం తీసుకొచ్చారని వివరించారు.
దళితబంధు లబ్ధిదారులంతా ఒకేవ్యాపారంపై దృష్టి సారించకుండా అధికారుల సూచనలతో వివిధ రంగాలపై మెళకువలు నేర్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు… కేసీఆర్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, దళిత బంధు పథకం లో ఇచ్చిన పది లక్షలను ఏడాదిలోగా 20 లక్షలు చేసి చూపించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దమ్మక్క పేట లోని దళిత కాలనీలో కాలినడకన తిరుగుతూ వారి వివరాలు సేకరించారు. ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు