పెద్దపల్లి : భార్య హత్య కేసులో భర్తకు పెద్దపల్లి జిల్లా 6వ అదనపు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. 2016, అక్టోబర్ 30న గోదావరిఖని కల్యాణ్నగర్లో ఏరియాలో జూలూరి సరితను భర్త ప్రవీణ్ కుమార్ హత్య చేశాడు. అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, గోదావరిఖని వన్ టౌన్ సీఐతో పాటు ఏసీపీ అపూర్వరావు చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శంకర్, తిరుపతిగౌడ్ సాక్షులను ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బస గణపతి వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి భరత లక్ష్మి నిందితుడికి జీవిత ఖైదీతో పాటు రూ.15వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.