జనగామ : భార్యపై భర్త గొడ్డలితో దాడి చేయంతో భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జిల్లాలోని నర్మెట మండలం మచ్చు పహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బందెల నర్సయ్య, రజిత భార్యాభర్తలు.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మరోసారి గొడవ జరుగడంతో కోపంతో నర్సయ్య భార్యపై గొడ్డలితో దాడి చేశాడు.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఎస్ ఐ రవి కుమార్ చేరుకుని గాయపడిన రజితను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.