న్యూఢిల్లీ, జనవరి 26: భారత స్టార్టప్ల్లోకి గత ఏడాది నిధుల ప్రవాహం భారీగా తగ్గింది. 2022లో దేశీ స్టార్టప్ల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు 38 శాతం క్షీణించినట్టు ఫైనాన్షియల్ డాటాబేస్ సంస్థ గ్లోబల్డాటా వెల్లడించింది. నిరుడు 1,726 వీసీ ఫండింగ్ లావాదేవీల ద్వారా 20.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే భారత స్టార్టప్ల్లోకి వచ్చాయని, 2021లో 1,715 డీల్స్ 33.8 బిలియన్ డాలర్ల వీసీ పెట్టుబడుల్ని ఆకర్షించినట్టు గ్లోబల్డాటా వివరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మార్కెట్ ఒడిదుడుకులు..భారత్లో పెట్టుబడుల కార్యకలాపాల్ని, నిధుల సమీకరణను దెబ్బతీస్తున్నాయని, దీంతో స్టార్టప్ల్లోకి వీసీ పెట్టుబడి భారీగా 38.2 శాతం తగ్గినట్టు తెలిపింది. వీసీ ఫండింగ్ లావాదేవీలకు సంబంధించి ఆసియా-పసిఫిక్ మార్కెట్లో భారత్ కీలకమైనదని, వీసీ నిధుల పరిమాణం, విలువ రీత్యా చైనాకు సమీపంలోనే భారత్ ఉన్నదని గ్లోబల్డాటా అనలిస్ట్ అరొజ్యోతి బోస్ చెప్పారు.