అశ్వారావుపేట, ఏప్రిల్ 1 : పామాయిల్ గెలల ధర భారీగా పెరిగింది. ఉగాది కానుకగా ఆయిల్ ఫెడ్ శుక్రవారం రైతులకు రికార్డు ధర ప్రకటించింది. ఏప్రిల్ నెలకు గాను టన్ను గెలల ధరను రూ.22,841గా నిర్ణయించింది. గత నెలతో పోల్చితే టన్ను ధర అదనంగా రూ.3,342 పెరిగింది. గత మార్చి నెలలో టన్ను ధర రూ.19,499 ఉన్న విషయం తెల్సిందే. పామాయిల్ గెలల ధర భారీగా పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.