న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కాలంలో అసురక్షితంగా శృంగారంలో పాల్గొనడం వల్ల 85 వేలకుపైగా హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర టాప్లో ఉన్నది. మధ్యప్రదేశ్లోని నీముచ్కు చెందిన కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా డేటా కోరారు. దీంతో 2020-21 మధ్య లాక్డౌన్ కాలంలో సురక్షితంకాని లైంగక చర్యల వల్ల 85,268 ఎయిడ్స్ కేసులు నమోదైనట్లు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్ఏసీవో) తెలిపింది. అత్యధికంగా 10,498 కేసులతో టాప్లో మహారాష్ట్రలో ఉండగా, 9,521 కేసులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 8,947 హెచ్ఐవీ కేసులతో మూడో స్థానంలో కర్ణాటక, 3,037 కేసులతో మధ్యప్రదేశ్, 2,757 కేసులతో పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
కాగా, 2011-12తో పోల్చితే 2020-21లో అసురక్షిత శృంగారం వల్ల సంభవించే హెచ్ఐవీ కేసులు గణనీయంగా తగ్గినట్లు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. 2011-12లో ఈ సంఖ్య 2.4 లక్షలు ఉండగా, 2019-20లో 1.44 లక్షలు, 2020-21లో 85,268గా ఉన్నట్లు పేర్కొంది. అయితే గత పదేళ్లలో ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్డౌన్ కాలంలో అసురక్షిత లైంగిక చర్యల వల్ల 85 వేలకుపైగా హెచ్ఐవీ కేసులు నమోదు కావడం ఆందోళనకరమేనని కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ అన్నారు. ఎయిడ్స్పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నారు.