హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలోని పలు మెట్రో నగరాల్లో నివాస గృహాల ధరలు తగ్గుముఖం పట్టినా.. హైదరాబాద్లో మాత్రం పరుగులు పెడుతున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ ప్రాపర్టీ టైగర్ డాట్కామ్ తాజా నివేదికలో ముంబై తర్వాత హైదరాబాద్లోనే అత్యధిక ధరలున్నాయని తేలింది. బుధవారం విడుదలైన ఈ నివేదికలో హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది జనవరి-మార్చిలో 6,556 ఇండ్ల విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. అలాగే 14,572 కొత్త ఇండ్ల నిర్మాణాలూ ప్రారంభమమ్యాయి. ఇక నగరంలో ఆస్తి విలువ వార్షికంగా 7 శాతం వృద్ధి చెందిందని ప్రాపర్టీ టైగర్ పేర్కొన్నది. ఈ క్రమంలోనే దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ముంబై తర్వాత హైదరాబాద్లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం చదరపు అడుగుకు సరాసరి ధర రూ.6,000-6,200ల వరకు ఉందన్న ప్రాపర్టీ టైగర్.. హైదరాబాద్ కేంద్రంగా భారీ, విలాసవంతమైన ఇండ్లకు డిమాండ్ పెరిగినట్టు తెలియజేసింది. దీంతో ధరలు పరుగులు పెడుతున్నాయని ప్రాపర్టీ టైగర్ గ్రూప్ సీఎఫ్వో వికాస్ వాద్వాన్ తెలిపారు.
హైదరాబాద్6,000-6,200
నగరాలవారీగా ఇండ్ల ధరలు (రూ.లలో)
నగరం మార్చి నాటికి చ.అ.
ముంబై 9,800-10,000
చెన్నై 5,700-5,900
బెంగళూరు 5,600-5,800
పుణె 5,400-5,600
ఢిల్లీ ఎన్సీఆర్ 4,500-4,700
కోల్కతా 4,300-4,500
అహ్మదాబాద్ 3,500-3,700