ఢిల్లీ ,మే 14: హిందుజా గ్రూప్ దాతృత్వ విభాగం హిందుజా ఫౌండేషన్ ఇప్పుడు మానసిక ఆరోగ్యం , సంక్షేమ రంగాలలో ప్రవేశించింది. ఈ ఫౌండేషన్ చోప్రా ఫౌండేషన్, జాన్ డబ్ల్యు బ్రిక్ మెంటల్ హెల్త్ ఫౌండేషన్ ,సీజీ క్రియేటివ్స్ల భాగస్వామ్యంతో నెవర్ ఎలోన్ గ్లోబల్ మెంటల్ హెల్త్ (వర్ట్యువల్) సదస్సులో భాగమైన స్పాట్లైట్ ఇండియాకు మద్దతునందిస్తున్నది. మూడు గంటల పాటు జరిగే ఈ స్పాట్లైట్ ఇండియా విభాగంలో సద్గురు , అభయ్ డియోల్ వంటి సుప్రసిద్ధ వ్యక్తులు ప్రసంగించనున్నారు.
ఈ వర్ట్యువల్ సదస్సు ఫేస్బుక్, యూట్యూబ్ , ఇతర మాధ్యమాలపై 21 మే 2021వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.ఈ సదస్సులో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యం కోసం తోడ్పడే ఉచిత ఆన్లైన్ ఉపకరణాలను https://neveralonesummit.live/ ద్వారా వినియోగించుకోవచ్చు.
‘‘మానసిక ఆరోగ్య సమస్యలు నిశ్శబ్దంగా ఉంటాయి. గుర్తించనటువంటి మహమ్మారిగా దీనిని వెల్లడించవచ్చు. తప్పుడు ప్రచారాల కారణంగా పరిస్థితి నివారించలేని స్థితికి చేరుతుంది. దీనికి వైద్యమూ అవసరమవుతుంది. అయితే అది కూడా సవాల్గానే పరిణమిస్తుంటుంది. నా దృష్టిలో బాధిత వ్యక్తికి పలు రీతులలో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ సదస్సు ఆ తరహా అవకాశాలను అందిస్తుంది’’ అని హిందుజా గ్రూప్ కో ఛైర్మన్ , హిందుజా ఫౌండేషన్ ట్రస్టీ గోపిచంద్ పీ హిందుజా అన్నారు.