సిమ్లా : కొవిడ్ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మళ్లీ ఈ-రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అమలుతో అంతర్రాష్ట్ర కదలికలన్నీ పర్యవేక్షించబడుతాయని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సుభాగ్ సింగ్ తెలిపారు. ఈ నిబంధన ఉత్తర్వుల నుంచి పలువర్గాల ప్రజలను ప్రభుత్వం మినహాయించింది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సరఫరాదారులు, కార్మికులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ అధికారులు, వైద్యం కోసం వచ్చే వారికి మినహాయింపును ఇచ్చింది. అలాగే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు, తల్లిదండ్రులకు ఇద్దరికీ టీకాలు, కొవిడ్ ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ను ఈ-రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించింది. ఇంతకు ముందు ఈ నెల 10న ప్రభుత్వం 13వ తేదీ నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది.