కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు పొటెత్తారు. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం నమోదుకాగా.. ఈసారి 86.33 శాతం నమోదయ్యింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా జరిగింది. ఈ నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ ఎవరికి వారే వారి ఖాతాల్లో వేసుకుంటూ విజయధీమాను వ్యక్తంచేశారు.
అలాగే, ఉదయం నుంచి పోలింగ్ గంట గంటకు పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. నిజానికి హుజూరాబాద్లో గతంలోనూ ఇతర నియోజకవర్గాలతో పొల్చితే పోలింగ్ అధికంగా ఉండేది. అదే చైతన్యాన్ని ఈసారి కూడా ఓటర్ల చూపించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉదయం రెండు గంటల్లో కొంత మందకొడిగానే జరిగిన ఆ తదుపరి మాత్రం పోలింగ్ వేగం పెరుగుతూ వచ్చింది. అధికారుల అంచనాల ప్రకారం 85 శాతం అయ్యే అవకాశాలు న్నాయని అంచనాలు వేసినా.. దానికి మించి పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 2,37,022 ఓట్లు ఉండగా ఇందుల 1,17,922 మంది పురుషులు, 1,19,099 మంది మహిళలలున్నారు. ఒకరు ఇతరులున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగిన పోలింగ్ తీరు ఇలా ఉంది..
సమయం | జరిగిన పోలింగ్ |
9.00 | 10.50% |
11.00 | 33.27 % |
1.00 | 45.63 % |
3.00 | 61.66 % |
5.00 | 76.26 % |
7.00 | 86.33 % |