అలహాబాద్: యూపీ వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని వ్యాస్ తహ్ఖానాలో హిందువుల ప్రార్థనకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పనుంది. మసీదులోని ఒక సెల్లార్లో హిందూవులు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంతో 31 ఏండ్ల తర్వాత తొలిసారిగా గత నెలలో ఇక్కడ పూజలు జరిపారు. అయితే పూజలు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలంటూ కొన్ని ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు తీర్పును వెలువరించనుంది.