హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కొవిడ్ నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడ్డ కోర్టు.. ఆర్టీ పీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి రోజు లక్ష పరీక్షలు నిర్వహించాలని, ఆర్టీ పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల వివరాలు హెల్త్ బులెటిన్లో వేర్వేరుగా ఇవ్వాలని సూచించింది.
భౌతికదూరం, మాస్క్ల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది. అయితే, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై, నియంత్రణపై కేబినెట్ చర్చించనుందని ఏజీ హైకోర్టు దృష్టికి తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించిన కోర్టు.. కేసు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.