హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి,ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు బుల్లెట్ఫ్రూఫ్ వాహన భద్రతను వెనకి తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గం డ్ర మోహన్రావు వాదిస్తూ.. ఆర్ఎస్ ప్ర వీణ్కుమార్ ఐపీఎస్ అధికారింగా ఉండ గా గతంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతా ల్లో పనిచేశారని గుర్తుచేశారు.
ఈ కారణంగా పిటిషనర్ ప్రాణాలకు ముప్పు ఉన్నదని తెలిపారు. ఆయనకు భద్రతను ఉపసంహరించే ముందు ఎలాంటి అధ్యయనం చేయలేదని తప్పుపట్టారు. వాదనల అనంతరం హైకోర్టు.. ఈ వ్యవహారంపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని వెనకి తీసుకోరాదని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.