కొలంబో: శ్రీలంక జాతీయురాలు, ఆ దేశానికి చెందిన అలనాటి సంప్రదాయ నృత్యకారిణి, 89 ఏండ్ల వజిర చిత్రసేనకు ఇవాళ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శ్రీలంకలోని భారత హైకమిషనర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సమక్షంలో భారత హైకమిషనర్ అవార్డును అందజేశారు. శ్రీలంక సంప్రదాయ నృత్యరంగానికి వజిర చిత్రసేన ఎనలేని సేవలందించారు.
ఆమె తన అద్భుతమైన నృత్య రీతుల ద్వారా భారత్-శ్రీలంక దేశాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడేందుకు దోహదం చేశారు. అందుకే భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ మేరకు ఇవాళ భారత హైకమిషనర్ చేతుల మీదుగా అందజేసింది. ఈ విషయాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది.