మాస్కో : రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. 16 మందితో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్ గురువారం తెల్లవారు జామున కూలిపోయింది. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో సిబ్బందితో సహా 16 మంది అందులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ముగ్గురు సిబ్బంది కాగా.. మిగతా వారంతా పర్యాటకులని తెలిపారు. సంఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లను పంపినట్లు పేర్కొన్నారు. వారు తొమ్మిదిని రక్షించారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మిగతా వారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. మరో ఎనిమిది మంది మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.