కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో కాలువలు, ఒర్రెల్లో వరద ప్రవాహం కొనసాగింది. పలు చోట్ల లోతట్టు ప్రదేశాల వద్ద పంటల్లోకి వరద నీరు చేరింది. పలు గ్రామాల సమీపంలో రోడ్ల పై నుంచి నీరు ప్రవహించింది. భారీ వర్షం కురిసే అవకాశముందని ముందస్తు సూచనలతో అన్ని గ్రామాల్లో అధికారులు సోమవారం సాయంత్రం నుంచే అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి రోడ్లు కోతకు గురయ్యాయి. కట్టుకాలువలు, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.