న్యూఢిల్లీ: దక్షిణ భారతంలో డిసెంబర్-ఫిబ్రవరి మధ్య సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనావేసింది. ఉత్తర-పశ్చిమ భారతంలో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురువొచ్చని వెల్లడించింది. గతనెలలో దేశవ్యాప్తంగా మంచి వర్షాలే కురిశాయని ఐఎండీ పేర్కొంది. నవంబర్లో 645 సార్లు భారీ వర్షాలు, 168 సార్లు అతి భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. గత ఐదేండ్లలో ఒక్క నెలలోనే ఈ స్థాయిలో వర్షాలు కురువడం ఇదే తొలిసారి అని వివరించింది.