హైదరాబాద్ : మూసీ నదికి భారీగా వరద ఉధృతి పెరిగింది. మూసారంబాగ్ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపివేసి, ట్రాఫిక్ను మళ్లించారు. గోల్నాక న్యూ బ్రిడ్జి దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలాగే చాదర్ఘాట్ చిన్న వంతెనపైకి వాహనాలకు రాకుండా చర్యలు చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతానికి చిన్నారులు రావొద్దని హెచ్చరించారు.
ఈ క్రమంలో చాదర్ఘాట్, శంకర్నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్పేటలో హైఅల్టర్ ప్రకటించారు. మూసీ వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. మూసీలో క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు నీటిమట్టాన్ని పరిశీలిస్తున్నారు. ప్రవాహాన్ని అంబర్పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్, మలక్పేట ట్రాఫిక్ సీఐ జ్యోత్స్న పరిశీలించారు.