నల్లగొండ : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
ఆదివారం జిల్లాలోని రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామంలో దళితబంధుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన దళిత వాడల్లో దళితబంధుపై ప్రజలతో సుదీర్ఘ సమావేశమై మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగునున్న మనమంతా ఓనర్లం అవ్వాలన్నదే కేసీఆర్ ఆరాటమన్నారు.
దానికోసమే దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాల కోసమే రాజ్యాంగ సవరణ అవసమని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. దళితబంధును దశల వారీగా అన్ని కుటుంబాలకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.