జనగామ : సమాజానికి నిజమైన సేవకుడు, అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సేవాలాల్ జయంతి సందర్భంగా జిల్లాలోని దేవరుప్పులలో జరిగిన వేడుకల్లో పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సేవాలాల్ మహరాజ్ బంజారా జాతికే కాదు యావత్ జాతికే ఆదర్శ పురుషుడయ్యారని కొనియాడారు.
బంజారా జాతిని మంచి మార్గంలో నడిపించేందుకు సేవాలాల్ మహరాజ్ ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, లాంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. మూఢ నమ్మకాలను నమ్మొద్దు అని ప్రజలకు చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త
అని ప్రశంసించారు. జీవితమంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు సేవాలాల్ అని ఆ మహనీయుడి మార్గంలో మనమంతా నడువాలని పిలుపునిచ్చారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు.