Harish rao | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించగా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకుడికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు. అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
అంతిమయాత్రలో పాల్గొన్న హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు https://t.co/ZSG6S9acfR pic.twitter.com/R71PNz2LAO
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026