పెద్దవంగర, డిసెంబర్ 6: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పలువురు 1.20 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. సోమవారం తాసిల్దార్ సరితరాణితో కలిసి కలెక్టర్ శశాంకకు భూపత్రాలు అందజేశారు. దాతలు కేతిరెడ్డి సోమనర్సింహరెడ్డి, జాటోత్ నెహ్రూనాయక్, పాలకుర్తి యాదగిరిరావు, అనబత్తుల ప్రభాకర్రావు, అనబత్తుల నాగేశ్వరరావు, ముప్పాల సురేశ్బాబు, చెరుకు మహేశ్వర్రెడ్డి, పసులేటి వెంకట్రామయ్యను కలెక్టర్ అభినందించారు. ఆ స్థలంలో ఎంపీడీవో, తాసిల్దార్, ఐకేపీ, వ్యవసాయ, ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయాలు నిర్మించనున్నట్టు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి మేరకు భూములు అందించినట్లు దాతలు పేర్కొన్నారు.