రాయపోల్ : భద్రాచల ( Bhadrachalam ) రామయ్య కల్యాణానికి సిద్ధిపేట జిల్లా రాయపోల్ ( Rayapol ) మండలం రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలను తరలించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ( Ramaraju ) ఈ సంవత్సరం 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలు అందించాలన్న సంకల్ప దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా రామనామ స్మరణ చేయించి గోటి తలంబ్రాలు సిద్ధం చేయిస్తున్నారు.
అందులో భాగంగా ఆదివారం రాంసాగర్ , వివిధ గ్రామాల నుంచి వచ్చిన గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచలం వెళ్లలేక పోయిన భక్తులు ఓలిచిన తలంబ్రాలు రామయ్య కల్యాణానికి చేరడం ఎన్నో జన్మల పుణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో యెనిశెట్టి వెంకటేశం, ఆదిరెడ్డి, యాదగిరి, నగేష్, చంద్రం, పోచయ్య పాల్గొన్నారు.