తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయని.. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కోవిడ్-19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.