హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీ నటుడు విష్ణు విశాల్ దంపతులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. విరిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్కి అభినందనలు తెలిపారు.
అలాగే ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్కు విష్ణు విశాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. అనంతరం విష్ణు విశాల్, గుత్తా జ్వాలకి గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.