హైదరాబాద్, ఆట ప్రతినిధి: ధనవంతుల క్రీడగా పేరొందిన గోల్ఫ్లో మన రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. కోలార్(కర్ణాటక) వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ టోర్నీలో గురుకుల గోల్ఫర్లు ఐదు స్వర్ణాలు సహా రెండు రజత పతకాలతో సత్తాచాటారు. వివిధ విభాగాల్లో బరిలోకి దిగిన గోల్ఫర్లు అంచనాలకు మించి రాణించారు. నాచర్ల గురుకులానికి చెందిన అనూష ‘హోల్ ఇన్ వన్’ సాధించి రూ.25 వేల విలువైన గోల్ఫ్ ట్రాలీని సొంతం చేసుకోగా, 76 పాయింట్లతో అమూల్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్గా అనూష, అమూల్య, ముకుల్, ప్రగతి, అఖిల పసిడి పతకాలతో మెరువగా, నవీన, విఘ్నేశ్ రజతాలు సొంతం చేసుకున్నారు.