అహ్మాదాబాద్: దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆ నాటి సీఎం నరేంద్ర మోదీని ఇరికించేందుకు అహ్మద్ పటేల్ ప్రయత్నించినట్లు సిట్ తన రిపోర్ట్లో ఆరోపించింది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్లకు అహ్మద్ పటేల్ 30 లక్షలు ఇచ్చారని, అల్లర్ల కేసులో మోదీని ఇరికించాలా ఉద్దేశంతో పటేల్ ఆ డబ్బులు ఇచ్చినట్లు సిట్ తన రిపోర్ట్లో పేర్కొన్నది. సెతల్వాద్, శ్రీకుమార్లు నేర కుట్రకు, ఫోర్జరీకి పాల్పడినట్లు సిట్ వెల్లడించింది. కాంగ్రెస్ నుంచి అక్రమంగా డబ్బు తీసుకునేందుకు తీస్తా, శ్రీకుమార్లు కుట్రకు పాల్పడినట్లు సిట్ తేల్చింది. ఈ నేపథ్యంలో సిట్ ఏసీపీ బీసీ సోలంకి తరపున న్యాయవాదులు శుక్రవారం సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
జూలై రెండవ తేదీన తీస్తా, శ్రీకుమార్లను 14 రోజుల పాటుకు రిమాండ్కు తరలిస్తూ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ అల్లర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ను అహ్మదాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. గోద్రా ఘటన తర్వాత ఆ నాటి సీఎం మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు తీస్తా, శ్రీకుమార్, సంజీవ్లు రకరకాల పిటిషన్లు దాఖలు చేసినట్లు సిట్ తెలిపింది. అహ్మద్ పటేల్తో నిందితులు పలుమార్లు కలిశారని, పటేల్ నుంచి తొలుత 5 లక్షలు, ఆ తర్వాత రెండు రోజులకు 25 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020లో అహ్మద్ పటేల్ మరణించిన విషయం తెలిసిందే.
సిట్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ప్రధాని మోదీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని, మరణించిన వారిని కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నట్లు జైరాం రమేశ్ తన ట్వీట్లో ఆరోపించారు.
Statement Issued by @Jairam_Ramesh , General Secretary In- Charge, Communications, AICC pic.twitter.com/vZo55UcDcN
— Congress (@INCIndia) July 16, 2022
విపక్షాలను తప్పుపట్టేందుకు తన తండ్రి పేరును వాడుతున్నట్లు అహ్మద్ పటేల్ కూతురు ముమ్తాజ్ పటేల్ ఆరోపించారు. యూపీఏ సమయంలో తీస్తా సెతల్వాద్కు ఎందుకు రివార్డులు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ ఇంత పెద్ద కుట్ర జరిగితే తన తండ్రిని ఎందుకు ప్రభుత్వం ప్రొసిక్యూట్ చేయలేదని ఆమె అడిగారు.
I guess his name @ahmedpatel still holds weight to be used for political conspiracies to malign d opposition.Why during UPA years @TeestaSetalvad was not rewarded & made Rajya sabha membr & why the center uptil 2020 did not prosecute my father for hatching such a big conspiracy ?
— Mumtaz Patel (@mumtazpatels) July 16, 2022