అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈనెల 17న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group 1 prelims) పరీక్షకు హాల్ టికెట్లను విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షను నిర్వహిస్తున్నారు. జనవరి 28 వరకు ఆన్లైన్ (Online) లో దరఖాస్తులను స్వీకరించగా ఏపీ వ్యాప్తంగా లక్షా 48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పాస్వర్డ్, ఎంటర్ చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు సూచించారు.
,