హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. జపాన్లో భారత రాయబారి సంజయ్కుమార్ వర్మ టోక్యోలోని కోహన ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి శుక్రవారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆరెంజ్, ఆలివ్, గులాబీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకు వివరించారు. హరిత ప్రపంచానికి అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాజ్గ్రూప్, నిర్వాణం అండ్ నేహా ఎన్ టెక్నాలజీస్ నిర్వహించాయి. గ్రీన్ ఇండియా చాలెంజ్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లినందుకు రాయబారి వర్మకు, నిర్వాహకులకు ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.