కొడంగల్, నవంబర్ 24: మండలంలోని చిన్ననందిగామ, చిట్లపల్లి, అంగడి రైచూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే ముందు ఆరబెట్టి చెత్త లేకుండా శుభ్ర పరచుకోవాలని సూచించారు. తేమ 14 నుంచి 17శాతం లోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏ గ్రేడు ధాన్యానికి రూ.1960, బీ గ్రేడు ధాన్యానికి రూ.1940 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఏఈవో ఇచ్చిన కూపన్, ఆధార్ కార్డు, భూమి పట్టాపాస్బుక్, బ్యాంకు ఖాతా పాస్బుక్ జిరాక్స్లు వెంట తీసుకురావాల్సి ఉంటుందని తెలిపా రు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, ఆయా గ్రామాల సర్పంచ్లు సావిత్రమ్మ సాయిలు, వెంకట్రెడ్డి, గోవింద్, పీఏసీఎస్ డైరెక్టర్ వినోద్కుమార్, ఏడీఏ వినయ్కుమార్, ఏవో ఢాక్యానాయక్లతో పాటు టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
బషీరాబాద్ నవంబర్ 21: బషీరాబాద్ మండలంలోని దామర్చెడ్ గ్రా మం లో పీఏసీఎస్ నవాంద్గీ ఆధ్వర్యంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు దళారుల బారిన పడకుండా కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయిం చాలన్నారు.
తాండూరు రూరల్, నవంబరు 24: తాండూరు మండలం, గోనూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గోవింద్ ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం చూసుకొని రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.
మద్దతు ధరతో ధాన్యం సేకరణ
యాలాల నవంబర్ 21 : యాలాల మండలంలోని జుంటుపల్లి గ్రామంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, డీసీఎంఎస్ మేనేజర్ శ్యాంసుందర్రెడ్డితో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మద్దతు ధరతో ధాన్యాన్ని సేక రిస్తున్నామన్నారు.
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
దౌల్తాబాద్, నవంబర్ 24: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సింగిల్ విండో చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండల కేంద్రంతోపాటు గోకఫస్లవాద్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. చివరి గింజకొనే వరకు కేంద్రాలు ఉంటాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రైతులకు ఇబ్బందులు రావొద్దనే..
పరిగి టౌన్, నవంబర్ 24 : పరిగి మండల పరిధిలోని రాఘవపూర్ గ్రా మంలో డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బుధ వారం గ్రామ సర్పంచ్ నల్క జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అందుబాటులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో డీఏవో గోపాల్, ఏవో ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్రెడ్డి, డీసీఎంఎస్ ఇన్చార్జి సంతోష్ పాల్గొన్నారు.
ధాన్యం డబ్బులు నేరుగా ఖాతాలోకి..
పూడూరు, నవంబర్ 24 :పూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్లో వరి కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ పి.సతీష్రెడ్డి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వరిసాగు చేసిన రైతులు ముందుగా ఆన్ లైన్లో నమోదు చేసి ఉండాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని తెలిపారు.