కీసర, ఏప్రిల్ 25 : రైతులు పండించిన పంటలు కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో కీసర ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ రామిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి సంవత్సరం కీసరలోని ప్రాథమిక సెంటర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామన్నారు. రైతులకు తమ సహకార సంఘం నుంచి సబ్సిడీ కింద విత్తనాల నుంచి మొదలు పెడితే పండించిన పంటలను కూడా కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకే ధాన్యాన్ని కొనగోలు చేస్తుందన్నారు.