న్యూఢిల్లీ, నవంబర్ 29: రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ప్రతీ ఏడు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేంద్రం ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ప్రారంభించింది. ఇది వృద్ధులు పడుతున్న ఇబ్బందులను దూరం చేస్తుందని పేర్కొన్నది. ఈ టెక్నాలజీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. దీంతో 68 లక్షల మంది కేంద్ర పెన్షనర్లే కాకుండా పీఎఫ్ ఖాతాదారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పెన్షనర్లు పెన్షన్ పొందాలంటే తాము జీవించి ఉన్నట్టు లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని సులభతరం చేస్తూ కేంద్రం గతంలో డిజిటల్ సర్టిఫికెట్ విధానాన్ని ప్రారంభించింది.